Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమిషనర్ అర్వింద్కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆయా అభివద్ధి,సంక్షేమ పధకాలను ప్రజలకు చేరవేయటంలో సమాచార శాఖ అధికారులది కీలకపాత్ర అని సమాచార పౌర సంబంధాల కమిషనర్ అర్వింద్కుమార్ అన్నారు. బుధవారం కమిషనరేట్ కార్యాలయంలో మల్టీజోన్ల వారిగా క్షేత్ర స్ధాయి అధికారులకు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న క్షేత్ర స్థాయి అధికారుల సమీక్ష సమావేశానికి కమీషనర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సమాచారశాఖ అధికారులు ఎప్పటికప్పుడు వత్తి నైపుణ్యాలను మెరుగు పరచుకోవాలని సూచించారు. సమాచార శాఖ అధికారులు జిల్లా అధికారులు, మీడియాతో సత్సంబంధాలు కలిగి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేయాలని కోరారు. ప్రకటనల విషయంలో జి.ఓ నెం.52 లోని మార్గదర్శకాలను పాటించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సక్సెస్స్టోరీల సేకరణలో ప్రత్యేక దష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఫోటో, వీడియో లైబ్రరీలను నిర్వహించి, సమాచార శాఖకు సంబంధించిన వివరాలను భద్రపరచాలని చెప్పారు. నైపుణ్యాలను పెంచుకోవడానికి అవసరమైన శిక్షణను సిబ్బందికి ఇప్పించాలని సూచించారు. పీఆర్, ఇంజినీరింగ్ విభాగాలు సమన్వయంతో పనిచేసి సమాచార శాఖకు మంచిపేరును తీసుకురావాలని అన్నారు. సమాచార శాఖ ద్వారా జారీ చేసే ప్రెస్ రిలీజులు, ఫోటోలు, వీడియోలు సమాచార శాఖ వెబ్సైట్ లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని వివరించారు. జిల్లా స్ధాయి మీడియా అక్రిడిటేషన్ కమిటీల ప్రతిపాదనలను త్వరితగతిన పంపాలని సూచించారు. జర్నలిస్టులకు సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు డైరెక్టర్లు నాగయ్య, కిషోర్ బాబు, జాయింట్ డైరెక్టర్లు జగన్, శ్రీనివాస్, సీనియర్ అధికారులు రాధాకిషన్, జయరాం మూర్తి, మధుసూదన్, వెంకటేశ్వర్లు, పాండురంగారావు, ప్రసాదరావు, హష్మి, వెంకట సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.