Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేములవాడ ఎమ్మెల్యే రమేష్బాబును నిలదీసిన యువకులు
నవతెలంగాణ - వేములవాడ రూరల్
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబును దళితబంధుపై యువకులు నిలదీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఎమ్మెల్యే వచ్చారు. ఈ సందర్భంగా కొందరు యువకులు.. తమకు దళితబంధు ఎప్పుడు వస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా 4 మండలాలను గుర్తించిన ప్రభుత్వం వేములవాడ రూరల్ మండలాన్ని ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే.. ఇది రాష్ట్ర స్థాయి పథకం అని, ప్రభుత్వంతో మాట్లాడి త్వరలో అమలయ్యే విధంగా చూస్తానని చెప్పారు. అయితే, ''ఇప్పటికే చాలా విషయాల్లో ఇలానే చెప్పారు.. ఏదో చెప్పి మీరు వెళ్లిపోతారు.. మళ్లీ ఎప్పుడు కలుస్తారో.. వస్తారో తెలియదు.. మేము ఎవరిని అడగాలి'' అని ప్రశ్నించారు. దీంతో సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే వెనుదిరిగారు. ప్రశ్నించిన యువకులను పోలీసులు పక్కకు లాక్కెళ్లారు.