Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఫ్ క్లబ్లో ఆమెదీ చురుకైన పాత్ర?
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
డ్రగ్స్ వినియోగంలో మనీ లాండరింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలపై బాలీవుడ్ న నటి ముమైత్ఖాన్ను ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం ప్రశ్నించారు. ఆమెకు డ్రగ్స్ విక్రేత కెల్విన్తో ఉన్న సంబంధాలపైన, వ్యాపార లావాదేవీలపై ప్రశ్నించారని తెలిసింది. ఉదయం పది గంటల ప్రాంతంలో ఈడీ ఇచ్చిన నోటీసుల మేరకు ముమైత్ఖాన్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి సాయంత్రం వరకు దాదాపు ఐదున్నర గంటలకు పైగా ఆమెను ఈడీ ప్రశ్నించింది. ముఖ్యంగా ఎఫ్క్లబ్తో ఉన్న సంబంధాలు మొదలుకుని డ్రగ్స్ విక్రేత కెల్విన్తో ఉన్న సన్నిహిత సంబంధాల వరకు ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించి జవాబులు రాబట్టడానికి కృషి చేశారని తెలిసింది. ప్రధానంగా ఆమె అకౌంట్ల నుంచి కెల్విన్ అకౌంట్లకు తరలిన డబ్బుల లావాదేవీల గురించి ఆమెను గుచ్చి గుచ్చి అడిగారని తెలుస్తోంది. కాగా ఎఫ్ క్లబ్లో ఎప్పుడు పార్టీలు జరిగినా , ఫంక్షన్లు జరిగినా ముమైత్ తప్పని సరిగా హాజరై చురుకుగా పాల్గొనే వారని కూడా ఈడీ గుర్తించినట్టు తెలిసింది. ప్రనధానంగా ఎఫ్ క్లబ్ ద్వారానే కెల్విన్ తన డ్రగ్స్ వ్యాపారాన్ని సులువుగా సాగించే వాడని అందుకు ముమైత్ఖాన్ ఏమైనా తోడ్పాటును అందించారా అనేది దిశగా కూడా ఈడీ ప్రశ్నించినట్టు సమాచారం. కాగా తనకు కెల్విన్తో మంచి పరిచయమే ఉన్నట్టు ముమైత్ అంగీకరించినట్టు తెలిసింది. పరిచయం మాత్రమే ఉందని అతను చేసే ఎలాంటి వ్యాపారాలతో సంబంధాలు లేవని ఆమె అన్నట్టు తెలుస్తోంది. అయితే కెల్విన్ అకౌంట్లోకి ఆమె అకౌంట్ల నుంచి ఎందుకు డబ్బులు పంపించారనే ప్రశ్నలకు ఆమె నుంచి సూటిగా సమాధానాలు లేవని తెలిసింది. కాగా దర్శకుడు పూరీ జగన్నాధ్, నటి చార్మీలతో కలిసి పలు వ్యాపారాలలో ముమైత్ పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అధికారులు గురిÊఈతంచారని సమాచారం. కాగా విచారణ పూర్తయ్యాక వెలుపలికి వచ్చిన నటి ముతైనఖాన్ మీడియాతో మాట్లాడకుండానే ముంబాయికి తిరిగి వెళ్లిపయారు. అవసరమైతే మరో సారి పిలుస్తామని ఈడీ అధకారులు ఆమెకు తెలిపినట్టు సమాచారం.