Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఎక్సైజ్శాఖ విచారణలో చాలా మందిని పెద్దలను తప్పించారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి విమర్శించారు. ఈ కేసులో తూతూ మంత్రంగా విచారణ జరిపిందని ఆరోపించారు. బుధవారం గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలోని పేరున్న కార్పొరేట్ పాఠశాలల్లోనూ డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్టు పోలీసుల విచారణలో తేలిందని చెపాపరు. అయినా ఈ వ్యవహారంలో విచారణ ముందుకు సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించిడం లేదని ప్రశ్నించారు. దీని వెనుకున్న రహస్యమేంటి నిలదీశారు. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. తాను పట్టువిడవకుండా కోర్టులో పోరాటం చేసినందునే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టిందన్నారు. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులను విచారిస్తున్నదని చెప్పారు. బెంగళూరు, గోవా సహా దేశంలోని కొన్ని ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ కేసులు నమోదైతే వాటి మూలాలు హైదరాబాద్లో ఉంటున్నాయని చెప్పారు. ఇది ఉండగా టీఆర్ఎస్ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు అపాయింట్ కోరుతూ కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్షాకు ఆయన లేఖ రాశారు.