Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షెడ్యూల్డ్ పరిశ్రమల్లో కనీసవేతనాలను సవరించాలి
- విడుదల చేసిన ఐదు జీవోలను వెంటనే గెజిట్ చేయాలి
- లేబర్కోడ్లను రద్దు చేయాలి : సీఐటీయూ
- కార్మిక గర్జన పాదయాత్రకు మేడ్చల్ కమిటీ 50 వేల విరాళం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో కనీస వేతనాల జీవోలను వెంటనే సవరించి ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన ఐదు జీవోలను వెంటనే గెజిట్ చేయాలనీ, కార్మిక కోడ్లను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 8న రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపునిస్తున్నట్టు సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన షెడ్యూల్డ్ పరిశ్రమల కార్మికుల రాష్ట్ర సదస్సుతీర్మానించింది. కార్మికులు ఈసమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరింది. కేంద్ర, రాష్ట్ర స్థాయి ట్రేడ్ యూనియన్లు, స్వతంత్ర ఫెడరేషన్లు, ఉద్యోగులు, మేధావులు, రాజకీయ పార్టీలు ఈ సమ్మెకు మద్దతిచ్చి జయ ప్రదం చేయాలని విజ్ఞప్తి చేసింది. పారిశ్రామిక ప్రాం తాలు, మండల కేంద్రాల్లో సన్నాహాలు చేసుకోవా లనీ, యాజమానులకు సమ్మె నోటీసులు అందజే యాలని యూనియన్లకు, కార్మిక శ్రేణులకు పిలుపు నిచ్చింది. బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షు లు చుక్కరాములు అధ్యక్షతన 'షెడ్యూల్డ్ పరిశ్రమల్లోని కార్మి కుల రాష్ట్ర సదస్సు' జరిగింది. వచ్చేనెల 8న తలపెట్టిన సమ్మె తీర్మానాన్ని సీఐటీయూ రాష్ట్రప్రధాన కార్యదర్శి ఎం.సాయి బాబు ప్రవేశపెట్టగా..ఆ యూనియన్ ఉపాధ్యక్షులు జె.మల్లి ఖార్జున్ బలపరిచారు. దాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదిం చింది. ఈసదస్సులో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు ఎస్.రమ, ఎన్.వెంకటేశ్, జె.చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. కార్మిక గర్జన పాదయాత్ర కోసం సీఐటీయూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ తరఫున జె.చంద్రశేఖర్ రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఎం.సాయి బాబు మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడున్నరేండ్లు గడుస్తున్నా ఒక్క కనీస వేతన జీవోను కూడా సవరించలేదనీ, 10, 15 ఏండ్ల నుంచి జీతాలు పెంచకపోతే కార్మికులు ఎట్లా బతకాలని ప్రశ్నించారు. షెడ్యూల్డ్ పరిశ్రమల కేటగిరీలోకి వచ్చే రంగాలు, కనీసవేత నాల చట్టం, సుప్రీం కోర్టు తీర్పుల గురించి వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెరిగిన వేతనాలు నేటికీ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2014, 2016లో కనీస వేతనాల సలహామండలి వేతనాలు పెంచుతూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపినా ఒక్క జీవోనూ విడుదల చేయలేదని విమర్శించారు. సీఐటీయూ, ఇతర కార్మిక సంఘాల పోరాటాలు, ఒత్తిడితో ఐదు జీవోలకు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చినా గెజిట్ జారీచేయకపోవడం అన్యాయమన్నారు. చట్ట ప్రకారం ఐదేండ్లకోసారి కనీస వేతనాల జీవోలను సవరించాలనే నిబంధనను పరిశ్రమల యాజమాన్యాల ఒత్తిడి మేరకు రాష్ట్ర సర్కారు తొక్కిపెడుతున్నదని విమర్శించారు. కనీసవేతనం పొందటం కార్మికుని హక్కుఅనీ, అది జీవించే హక్కు కిందకు వస్తుందని తెలిపారు. వెంటనే కనీసవేతనాల జీవోలను సవరించి గెజిట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ జీవోల కోసం విస్తృత ప్రాతిపదికన పోరాటాలు చేస్తామనీ, ఈ పోరులో కలిసివచ్చే కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకుని ఐక్యంగా ముందుకు సాగుతామని చెప్పారు. చుక్కరాములు మాట్లాడుతూ..కార్మిక చట్టాల రద్దు కోసం కార్మిక కోడ్లను తీసుకొచ్చి వారిని కట్టుబానిసలుగా మార్చే కుట్రకు కేంద్ర ప్రభుత్వం పూనుకున్నదని విమర్శించారు. కరోనా సమయం లో యూరప్, యూఎస్ఏ, సోషలిస్టు దేశాలు కార్మికులకు ఆర్థిక సహాయాన్ని అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. మనదేశంలో మాత్రం మోడీ సర్కారు అంబానీ, ఆదానీ, తది తర కార్పొరేట్లకు వేల కోట్ల ప్యాకేజీలిచ్చిందని విమర్శించారు. పనులు దొరక్క, మరోవైపు అరకొరవేతనాలతో కార్మికుల కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయిందన్నారు. ఆదాయపన్ను పరిధిలోకి రాని పేదలకు రూ.7,500 చొప్పున ఇవ్వాలని కార్మికసంఘాలు డిమాండ్ చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టిం చుకోలేదని విమర్శించారు. బడా పారిశ్రామికవేత్తలకు ప్యాకే జీలివ్వడం, కార్మిక కోడ్లను తీసుకురావడం వల్ల ఆర్థిక వృద్ధి పెరగదనీ, ఆవిధానాలు దేశానికే ప్రమాదమని హెచ్చరిం చారు. ఆర్థిక వృద్ధి రేటు గాడిలో పడాలంటే ముందు ప్రజల కొనుగోలు శక్తిని పెంచే చర్యలు చేపట్టాలనీ, కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. వాటి కోసం ఐక్య ప్రతిఘటనా ఉద్యమాలు రూపొందిస్తామన్నారు. జె. మల్లిఖార్జున్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవ లంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వివరిస్తూ వారిని చైతన్యపరిచేందుకు సీఐటీయూ ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్ర దృష్టికి వస్తున్న కీలకమైన అంశాలను తెలిపారు. వలస కార్మికులు ఇరుకైన గదుల్లో అత్యంత దుర్భరంగా బతుకుతున్న తీరును కండ్లకు కట్టినట్టు వివరించారు. కనీస వేతనాల జీవోలను విడుదల చేస్తే ఒక్క రూపాయి కూడా సర్కారు ఖజానాపై భారం పడదనీ, అయినా, రాష్ట్ర ప్రభు త్వం కొద్ది మంది పెట్టుబడిదారుల లాభాల కోసం లక్షలాది మంది కార్మికుల పొట్టలు కొట్టడం సమంజసం కాదని అన్నా రు. పారిశ్రామిక వాడల్లో స్థానికంగా కార్మికులకు దక్కాల్సిన హక్కులు, కనీసవేతనాలు దక్కపోవటం వల్లా ఏటా ఎన్ని వందల కోట్లు నష్టపోతున్నారనే విషయాన్ని అర్థమయ్యేలా కరపత్రాలు ముద్రించి కార్మికులను చైతన్యపరుస్తామన్నారు.