Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'తెలంగాణలో ఇటీవల పర్యటించి.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేసి, ప్రశంసించిన ఐటి పార్లమెంటరీ కమిటీ చైర్మెన్ శశిధరూర్పై నోరు పారేసుకున్న పీసీసీ అధక్షుడు రేవంత్రెడ్డికి సోషల్ మీడియా సెగ గట్టిగానే తగులుతున్నది...' అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. రేవంత్ లాంటి థర్డ్ రేటెడ్ క్రిమినల్ ఒక పార్టీకి నాయకత్వం వహిస్తే ఇలాగే ఉంటుందని విమర్శించారు. అలాంటి వారి నైజాన్ని ప్రజల ముందుంచాలని పేర్కొన్నారు. శశిథరూర్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలతో కూడిన ఆడియోను కేటీఆర్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.