Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర గవర్నర్, డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన పోరాటం చారిత్రాక స్వాతంత్య్ర పోరా టాల్లో ఒకటని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా వేడకలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. భారతదేశానికి 1974 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినప్పటికీ తెలంగాణ, మరఠ్వాడ, హైదరాబాద్-కర్ణాటకలతో కూడిన పూర్వ హైదరాబాద్ మాత్రం 1948 సెప్టెంబర్ 17న స్వేచ్ఛ లభించిం దని చెప్పారు. ఇది ఆనందంతో వేడుకలు చేసుకోవాల్సిన సందర్భమని అభిప్రాయ పడ్డారు. ప్రజలంతా తెలంగాణ విమో చనా దినోత్సవాన్ని జరుపుకోవాలని, స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటంలో ఉన్నత త్యాగాలు చేసి అమరులైన వారికి ఘనంగా నివాళులర్పించాలని పిలుపునిచ్చారు.