Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భార్య, అత్త హత్య
నవతెలంగాణ-కంటోన్మెంట్
భార్యపై అనుమానం ఇద్దరి హత్యకు కారణమైంది. భార్యను, అత్తను ఓ వ్యక్తి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన హైదరాబాద్లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. తిరుమలగిరి మిలటరీ క్వార్టర్స్ వద్ద నివాసముంటున్న చిన్నబాబు మిలటరీ ఆస్పత్రిలో ఎలక్ట్రీషియన్ గా, అతని భార్య నాగ పుష్ప కూడా అదే ఆస్పత్రిలో హెల్పర్గా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. తన భార్య మరొకరితో అక్రమ సంబంధం కలిగి ఉందనే అనుమానంతో గురువారం చిన్నబాబు ఆమెతో గొడవపడ్డాడు. ఆవేశంలో కత్తి తీసుకుని దాడి చేయబోయాడు. ఈ క్రమంలో భార్య తల్లి కుమారి అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపై కూడా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో అతని భార్య, అత్త మృతిచెందారు. తర్వాత పోలీసులకు సమాచారం అంద డంతో ఘటనా స్థలాన్ని సంద ర్శించి మృతదేహాలను పరిశీలిం చారు. పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలున్నాయని ఈ క్రమంలో గొడవ, హత్య జరిగాయని పోలీసులు తెలిపారు. తల్లి చనిపోవడం.. తండ్రి పోలీసుల అదుపులో ఉండటంలో పిల్లలు అనాథలయ్యారు.