Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి : గవర్నర్కు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నరెన్స్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
లబ్దిదారులకు ఎంతో ఇతోధికంగా సహాయపడుతున్న ఆసరా పింఛన్ల పథకంలో అంతేస్థాయిలో అవినీతి కూడా జరుగుతున్నదనీ, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్కు ఫోరం ఫర్ గుడ్ గవర్నరెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి గురువారం లేఖ రాశారు. హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్ మండలంలో ఆసరా పించన్ల పంపిణీలో 2014 అక్టోబర్ నుంచి డిసెంబర్ 2015 వరకు జరిగిన అవినీతిపై ఆర్డీఓ విచారణ జరిపి రూ.44 లక్షల అవినీతి జరిగిందనీ, అందులో తహసీల్దార్, మరో ఎనిమిది సిబ్బంది హస్తం ఉందని తేల్చిన విషయాన్ని గుర్తు చేశారు. రశీదు పుస్తకాలలో తప్పుడు వేలు ముద్రలతో డబ్బు తీసుకున్నారనీ, వాటన్నింటినీ ఆడిట్ ద్వారా విచారణ చేయించాలని కోరారు. ఇటీవల చార్మినార్ మండలంలో కూడా ఆసరా పింఛన్ల పంపిణీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, విజిలెన్స్ కమిషనర్కు లేఖ రాసినా చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. పింఛన్లలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపి లబ్దిదారులకు న్యాయం చేయాలని గవర్నర్ను కోరారు.