Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పోస్టలకు సంబంధించి అక్టోబర్ 24న రాత పరీక్షను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మె న్ వీవీ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. 151 ఏపీపీ పోస్టులకు సంబంధించి జులై నెలలో నోటిఫికేషన్ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఆగస్టు 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు 3089 దరఖాస్తులు ఆన్లైన్లో వచ్చాయని చైర్మెన్ తెలిపారు. కాగా అక్టోబర్ 24వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు మూడు గంటల పాటు అబ్జెక్టివ్ టైప్ పరీక్ష 200 ప్రశ్నలకు జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు వరకు రెండవ పేపర్ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ పరీక్ష హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాల్లోనే జరుగుతుందని అన్నారు. దీనికి సంబంధించిన సిలబస్ వివరాలను తమ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన కోరారు.