Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఏడు జిల్లాలకు జిల్లా విద్యాశాఖాధికారుల (డీఈవో)ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ డీఈవోగా పనిచేస్తున్న మాధవికి పెద్దపల్లి డీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. సూర్యాపేట డీఈవోగా మహమ్మద్ అబ్దుల్ మునాఫ్, మంచిర్యాల డీఈవోగా పనిచేస్తున్న జి పనిని ములుగు డీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మహబూబాబాద్ డీఈవోగా ఎస్ సత్యనారాయణ, కొమరంభీం ఆసిఫాబాద్ డీఈవోగా పి అశోక్ను, ఆదిలాబాద్ డీఈవోగా ప్రణీత, నిర్మల్ డీఈవోగా ఎ రవీందర్రెడ్డిని నియమించామని తెలిపారు.