Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి రోజు నాలుగు లక్షల మందికి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. నెలాఖరుకల్లా కోటి మందికి వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంఈ డ్రైవ్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా గురు వారం 2,69,067మందికి మొదటి డోసు, 1,32,539మందికి రెండో డోసును, మొత్తం 4,01,606మందికి టీకా ఇచ్చారు. రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభించిన తర్వాత ఒకే రోజు ఇంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వటం తొలిసారి. కాగా ఇప్పటి వరకు 1,47,96,127 మందికి మొదటి డోసు ఇవ్వగా, వారిలో 56,72,799 మంది రెండో డోసు టీకా కూడా వేయించుకున్నారు. మొత్తం కలిపి ఇప్పటి వరకు 2,04,68,826 డోసుల పంపిణీ పూర్తయినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం విడుదల చేసిన కోవిడ్-19 వ్యాక్సినేషన్ మీడియా రిపోర్ట్ వెల్లడించింది.