Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలువురు మంత్రులు, ఎమ్మెల్సీల హాజరు
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపొందిన రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. గురువారం శాసనమండలిలోని చైర్మెన్ చాంబర్లో ప్రొటెం చైర్మెన్ భూపాల్రెడ్డి పల్లాతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆయన..తాజాగా రెండవసారి పోటీ చేసిన విజయం సాధించారు. ఈ కార్యక్రమంలో మంత్రలు సత్యవతిరాథోడ్, మహమూద్్ అలీ, తలసాని శ్రీనివాసయాదవ్, వి శ్రీనివాసగౌడ్, జగదీశ్వర్రెడ్డి, వేములు ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, వాణీదేవి, అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహచార్యులు ఉన్నారు.