Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డుకున్న పోలీసులు
నవతెలంగాణ-మాక్లూర్
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ పోలీస్స్టేషన్లో ఓ వ్యక్తి పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంచంద్రపల్లి గ్రామానికి చెందిన పోశెట్టి అదే గ్రామానికి చెందిన కట్కం శంకర్ మధ్య కొన్నాళ్లుగా స్థలం విషయంలో తగాదాలు జరుగుతున్నాయి. ఇరు కుటుంబాలకు ఒప్పందం కుదిరే వరకు, సమస్య పరిష్కరించే వరకూ ఈ స్థలంలో ఎలాంటి పనులు చేపట్టవద్దని కోర్టు సూచించింది. అయితే శంకర్ కుమారుడు కట్కం తిరుపతి ఈ స్థలంలో సిమెంట్ పనులు చేస్తుండగా దొడ్డిండ్ల పోశెట్టి తన సెల్ఫోన్లో వీడియో తీశాడు. ఇది గమనించిన తిరుపతి పొశెట్టితో గొడవకు దిగాడు. ఇది తెలుసుకున్న పొశెట్టి కుమారుడు అరవింద్ సైతం గొడవకు దిగాడు. ఇది కాస్తా ముదరడంతో గొడవ మాక్లూర్ పోలీస్స్టేషన్ వరకు వెళ్లింది. దాంతో పోలీసు సిబ్బంది ఆరవింద్ను స్టేషన్కు తీసుకెళ్లడంతో 'తన కుమారుడిని ఎందుకు తీసుకువచ్చారు. ఇంటికి పంపండి. లేదంటే నేను చనిపోతున్నా'నంటూ పోశెట్టి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు, ఎస్ఐ రాజారెడ్డి తన పోలీసు వాహనంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.