Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ కె. రామకృష్ణన్, డాక్టర్ కె. సత్యగోపాల్తో కూడిన బెంచ్ ముందు సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఈ క్రమంలో ఏపీ సర్కారు కోర్టును ధిక్కరించటంపై చర్యలు తీసుకునే అధికారం ట్రిబ్యునల్కు ఉందంటూ తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. గవినోళ్ళ శ్రీనివాస్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్, తెలంగాణ ఏఏజీ రాంచందర్రావు ఈ మేరకు తమ వాదనలను వినిపించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై ఎన్జీటీ ప్రశ్నల వర్షం కురిపించింది. 'డీపీఆర్ను తయారు చేయటం కోసం ప్రాజెక్టు పునాదులు తవ్వాలా...? ట్రిబ్యునల్ తీర్పు అమలు కాకపోతే నిస్సహాయంగా మేం చూస్తూ ఉండాలా...?' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పుల అమలు కోసం తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఈ కేసును ఎన్జీటీ మంగళవారం మరోసారి విచారించనుంది.