Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి, వర్థంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల సీఎం కేసీఆర్కు ఐలమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్వర్యంలో ఐలమ్మ వారసులు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను గురువారం కలిశారు.ఈ కార్యక్రమంలో ఐలమ్మ వారసులు పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రామచ ంద్రం, వారి కొడుకు చిట్యాల సంపత్ - చిట్యాల శ్వేత, మనుమడు, మనుమరాళ్లతో పాటు మంత్రులు శ్రీనివాస్ గౌడ్,సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ, రైతు బం ధు సమితి రాష్ట్ర చైర్మెన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. కాపు, తెలగ,బలిజ,ఒంటరి కులాల సంక్షేమ భవన్కు స్థలం కేటాయించాలని వినతి కాపు, తెలగ,బలిజ, ఒంటరి కులాలకు హైద్రాబాద్లో సంక్షేమ భవన్ నిర్మాణానికి అనువైన స్థలం,నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ను పలువురు కలిశారు.జీహెచ్ఎంసీ పరిథి లోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి,ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు,నవీన్ కుమార్, ఎమ్మెల్యేలు వివేకానంద,మాధవరం కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.