Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులు మాపై అనుచితంగా వ్యవహరించారు
- తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా?
- రాష్ట్రాన్ని మద్యం మత్తులో ముంచెత్తుతున్నారు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో తాలిబాన్ల రాజ్యం సాగుతున్నదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. గురువారం హైదరాబాద్లోని లోటస్ఫాండ్లో ఆమె విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద కుటుంబానికి చెందిన ఆరేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి సంబంధించిన నిందితుణ్ని పోలీసులు పట్టుకోలేకపోయారని విమర్శించారు. తాము దీక్ష చేసిన తర్వాతే ప్రభుత్వంలో చలనం వచ్చిందని చెప్పారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమ పార్టీ కార్యకర్తల్ని పోలీసులు బలంవంతంగా వాహనాల్లో కుక్కి హౌజ్ అరెస్ట్ చేశారన్నారు. నిరసన తెలిపే హక్కు మాకు లేదా? అని ప్రశ్నించారు. ఇది తాలిబన్లను తలపించే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో నియంత పాలన సాగుతోందన్నారు. నిందితుల్ని పట్టుకుని, కఠినంగా శిక్షించకపోవడంతోనే ఆడబిడ్డలు, మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం , గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడి వల్ల అమ్మకాల వల్ల నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. దీనిని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు.