Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సరూర్నగర్
చిన్నారి చైత్ర కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలు గా ఆదుకోవాలని, రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా.. మూడెకరాల భూమి, డబుల్బెడ్రూమ్ ఇల్లు, కుటుం బంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతరాములు డిమాండ్ చేశారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో బాధిత కుటుంబాన్ని, చైత్ర తల్లిదండ్రులను గురు వారం చెరుపల్లి, సీపీఐ(ఎం) నాయకులు, బీజేపీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి పరామర్శిం చారు. అనంతరం చెరుపల్లి సీతరాములు మాట్లా డుతూ.. భవిష్యత్తులో ఇటువంటి దారుణాలు జరగ కుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవా లని కోరారు. మద్యపానం అనేక నేరాలకు కారణమ వుతోందని, రాష్ట్రంలో మద్యపానం బంద్ చేయాలని అన్నారు. నిందితుడు రాజు మరణంపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపించాలని కోరారు. చెరుపల్లి వెంట సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం.సోమయ్య, తెలం గాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి రామ్ శ్రీ రామ్ నాయక్, అధ్యక్షులు ధర్మ నాయక్, రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలు నాయక్, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎం. శ్రావణ్ కుమార్, మీనా, కిషన్ కృష్ణ, శ్రీను నాయక్ ఉన్నారు.
సీఎం సీట్లో కూర్చునే అర్హత కేసీఆర్కు లేదు..
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, కేసీఆర్కు సీఎం సీట్లో కూర్చునే అర్హత లేదని విజయశాంతి అన్నారు. చైత్ర కుటుంబాన్ని పరామ ర్శించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్, మందు నిలయంగా మార్చేశారని, ఇదే నేరాలకు కారణం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే ప్రజలను తమ కాళ్లమీద తాము నిలబడేలా చేస్తారనుకున్నాంగానీ, మత్తులో ముంచుతారనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అధికారంలో ఉన్నంతకాలం మహిళలకు రక్షణ ఉండదన్నారు. చైత్ర కుటుంబాన్ని పరామ ర్శించే టైమ్ కేసీఆర్కు లేదా? అని ప్రశ్నించారు.