Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కష్టం ప్రజలది.. లాభం కార్పొరేట్లకు
- ధరలు విపరీతంగా పెరుగుతాయి
- దేశానికి బీజేపీయే పెద్ద కరోనా : సీఐటీయూ వెబినార్లో బీవీ రాఘవులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశాన్ని అమ్మే కుట్రలో భాగమే కేంద్ర ప్రభుత్వ నేషనల్ మానిటైజేషన్ విధానమనీ, దీనికి వ్యతిరేకంగా ఉద్యమిం చకపోతే దేశంలోని ప్రజలందరికీ తీవ్ర నష్టం తప్పదని సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు హెచ్చరించారు. ' కేంద్ర ప్రభుత్వ నేషనల్ మానిటైజేషన్ విధానాన్ని తిప్పికొడదాం. సహజవనరులు- సంపదను కాపాడుకుందాం' అనే అంశంపై సీఐటీయు రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో గురువారం వెబినార్ను నిర్వహించారు. సీఐ టీయు రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాఘవులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తు లను కార్పొరేట్లకు కట్టబట్టేందుకే నగదీకరణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రయివేటీకరిస్తున్నారనీ దీనికి వ్యతిరేకం గా కార్మిక, ఉద్యోగ సంఘాలు పోరాటాలు నిర్వహించా యని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ ప్రయివేటీకరణను కొనసాగిస్తూనే.. అదనంగా ఈ నగదీకరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రకటించిందని వివరించారు. దీనివల్ల ప్రజాజీ వితంతో ప్రత్యక్షంగా సంబంధం ఉండే సేవలను కార్పొ రేట్లకు కట్టబెట్టబోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజల కష్టార్జితంతో ఏర్పాటైన ప్రభుత్వ రంగం ప్రయివేటీకరణ అయితే.. ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఉద్యోగులకు రక్షణ ఉండద న్నారు. సామాజిక న్యాయం జరగదని తెలిపారు. కష్టం ప్రజలది, దోచుకోవడం పెట్టుబడిదారులకా? అని ప్రశించారు. మానిటైజైషన్ వల్ల ప్రజాస్వామిక హక్కులు నాశనమవుతాయని చెప్పారు. ఫెడరిలిజం దెబ్బతింటుం దన్నారు.రాష్ట్రాల హక్కులు మరింత హరించుకు పోతాయని చెప్పారు. పెట్టుబడిదారుల లాభాలకోసం భక్తిశ్రద్ధలతో పనిచేసేది మోడీయే అని వారు భావిం చారని వివరించారు. కరోనా కాలంలో ప్రజల ఆదాయం తీవ్రంగా దెబ్బతింటే..కార్పొరేట్ల ఆదాయం బాగా పెరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీనే ఒక పెద్ద కరోనాగా ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.
ఏఐఐఈఏ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ మిశ్రా మాట్లా డుతూ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ కార్యక్రమాన్ని తీసుకురావడం అత్యంత శోచనీయమన్నారు. ఇది దేశ విద్రోహచర్య అని చెప్పారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ కరోనాతో కుదేలైందనీ, ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలు చేపట్టడం దీన్ని మరింత ప్రమాదంలోకి నెడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. మోడీ సర్కార్ అనుసరించిన దివాళాకోరు ఆర్థిక విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందన్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్ఎటీ తదితర ఆనాలోచిత నిర్ణయాలు దేశాన్ని దెబ్బకొట్టాయని చెప్పారు. 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించిన బ్యాంకింగ్ రంగంతో సహా రైళ్లు,విమానాలు,తపాల, బీఎస్ఎన్ఎల్ తదితర రంగాలను ప్రయివేటీకరించటమంటే భారత ఆర్థిక వ్యవస్థను మరింత అగాధంలోకి నెట్టడమేననీ, దీని వ్యతిరేకంగా ఉద్యోగ కార్మిక వర్గాలు ఉద్యమాలు చేపట్టక తప్పదని పిలుపునిచ్చారు.సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు మాట్లాడుతూ మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ సహజ వనరులు, ప్రజా సంపదను నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ పేరుతో అమ్మే కుట్రలకు తెరలేపిందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఆర్ఆర్బీఈ సెక్రటరీ జనరల్ ఎస్ వెంకటేశ్వర్రెడ్డి , ఆల్ఇండియా డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఏఐఆర్టీడబ్ల్యుఎఫ్ ఆర్లక్ష్మయ్య, ఆల్ఇండియా డిప్యూటీ జనరల్ సెక్రటరీ బీఎస్ఎన్ఎల్ఇయూ జె.సంపత్రావు, రాష్ట్ర అధ్యక్షులు సీజీ ఫెడరేషన్, వి నాగేశ్వర్రావు, హైదరాబాద్ పబ్లిక్ సెక్టార్ కో-ఆర్డనేషన్ కమిటి జె.రాఘరావు కన్వీనర్, జాయింట్ సెక్రటరీ, ఏఐడీఇఎఫ్ జీటీ గోపాలరావు, తదితర ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడారు.