Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుదివిడతలో 9,636 మందికి సీట్ల కేటాయింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీటెక్, బీఈ, బీ ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో లాటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాల కోసం నిర్వహించిన ఈసెట్ తుదివిడత సీట్లను సాంకేతిక విద్యాశాఖ కేటాయించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఈసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తుదివిడత కౌన్సెలింగ్ తర్వాత ఇంజినీరింగ్లో 242 సీట్లు, ఫార్మసీలో 989 సీట్లు కలిపి 1,231 సీట్లు మిగిలాయని తెలిపారు. తుదివిడతలో 9,636 మందికి సీట్లు కేటాయించామని వివరించారు. 167 ఇంజినీరింగ్ కాలేజీల్లో 9,824 సీట్లుంటే, 9,582 (97.53 శాతం) మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. 119 ఫార్మసీ కాలేజీల్లో 1,043 సీట్లకుగాను 54 (5.17 శాతం) మంది విద్యార్థులకు సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. ఫార్మసీ కాలేజీల్లో 94.83 శాతం సీట్లు మిగిలాయని వివరించారు. ఈనెల 20లోగా ట్యూషన్ ఫీజు చెల్లించాలనీ, ఆన్లైన్ ద్వారా సెల్ఫ్రిపోర్టింగ్ చేయాలని తెలిపారు. ఈనెల 21 నాటికి కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. ఇతర వివరాల కోసం https://tsecet.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.