Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో 2021-22 విద్యాసంవత్సరంలో ఆరో గరగతితోపాటు ఏడు నుంచి పదో తరగతి వరకు మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాలకు ఈనెల 20 గడువుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మోడల్ స్కూళ్ల ప్రాజెక్టు అదనపు డైరెక్టర్ జి ఉషారాణి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరో తరగతి, ఏడు నుంచి పదో తరగతి వరకు మిగిలిపోయిన సీట్ల కోసం గతనెల 21న రాతపరీక్ష నిర్వహించామని తెలిపారు. ఈనెల 15న మెరిట్ జాబితాతోపాటు ర్యాంకులను విడుదల చేశామని పేర్కొన్నారు. మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు వివరాలతోపాటు వెయిటింగ్ లిస్టును ప్రకటించామని వివరించారు. ఈనెల 20 నాటికి ర్యాంకుల ఆధారంగా ఎంపికైన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలనీ, అందుకు అవసరమైన ధ్రువపత్రాలను పరిశీలించాలని సూచించారు. అయినా సీట్లు మిగిలితే అదే విధానంలో ప్రవేశాలు కల్పించాలని కోరారు. జిల్లా జాయింట్ కలెక్టర్, డీఈవోను సంప్రదించి ఈనెల 30లోగా ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు.