Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మజ్లిస్ కనుసైగల్లోనే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాయంలో తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఓబీసీ జాతీయ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ఎగురవేశారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకుండా కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రభుత్వాలు అన్యాయం చేశాయని కిషన్రెడ్డి విమర్శించారు. రజాకార్ల నేత కాశిం రజ్వీ పెట్టిన పార్టీ ఎంఐఎం అనీ, అలాంటి పార్టీకి కేసీఆర్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, ఒవైసీ కుటుంబాలు తెలంగాణ ప్రజలను తమకి బానిసలుగా ఉండాలని కోరుకుంటున్నాయన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ వైఖరి, మజ్లిస్ దౌర్జన్యాన్ని ప్రజలు ఖండించాలన్నారు.