Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతం రంగు పులుమొద్దు : వీర తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కుల మతాలకతీతంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందని వీర తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం చెప్పారు. ఐద్వా సీనియర్ నాయకులు టి.జ్యోతి, రాష్ట్ర అధ్యక్షురాలు కె.ఎన్ ఆశాలత, రాష్ట్ర నాయకురాలు ఎం.స్వర్ణ లత బృందం శుక్రవారం ఆమెను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా స్వరాజ్యం మాట్లాడుతూ నాటి సాయుధ రైతాంగ పోరాటానికి బీజేపీ నేతలు మత రంగు పులుముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నైజాం పోలీసులు, రజాకార్లు, నెహ్రూసైన్యాల చేతిలో మహిళలు అమానుష చిత్రహింసలకు గురయ్యారని గుర్తుచేశారు. తమ కండ్ల ముందే కుటుంబ సభ్యులను హింసిస్తుంటే ధైర్యంగా ఎదుర్కొన్నారని చెప్పారు. భూమి కోసం, భుక్తికోసం సాగిన ఆ పోరాటాన్ని వక్రీకరించి రాజకీయ లబ్దిపొందాలని చూడటం తగదన్నారు. భావోద్వేగాలను రెచ్చగొట్టొద్దని హితవు పలికారు. మహిళలను నాలుగు గోడలకుపరిమితం చేసే మనువాద విధానాన్ని విడనాడాలని కోరారు. నేడు మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఐద్వా సీనియర్ నాయకురాలు జ్యోతి మాట్లాడుతూ మహిళల్లో నాటి పోరాట స్ఫూర్తి పెరగాల్సిన అవసరం ఉందవన్నారు. ఈ నెల 24 నుంచి 26 వరకు సూర్యాపేటలో జరిగే ఐద్వా రాష్ట్ర మహాసభలకు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు.