Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చరిత్రకు వక్రభాష్యాలొద్దు : మఖ్దూం భవన్లో జాతీయ జెండా ఎగరేసిన రాజా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో జరిగిన అనేక విముక్తి పోరాటాల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ పాత్ర శూణ్యమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లోని మఖ్దూం భవన్లో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో రాజా మాట్లాడుతూ భూమి, భుక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో అనేక మంది అమరులయ్యారని చెప్పారు. చారిత్రాత్మకమైన ఈ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తున్నదని వివరించారు. స్వాతంత్రోద్యమంలో ఎలాంటి పాత్ర లేని ఆర్ఎస్ఎస్, బీజేపీ జలియన్వాలాబాగ్ ఉదంతాన్ని సైతం తప్పుగా చిత్రీకరించేందుకు పూనుకుంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పది నెలలుగా సాగుతున్న రైతు ఉద్యమాన్ని అణచేందుకు కుట్రలు చేస్తున్నదని చెప్పారు. రాబోయే కాలంలో తెలంగాణ సాయుధ పోరాట వారసత్వ స్ఫూర్తితో మరిన్ని ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, పశ్యపద్మ తదితర నాయకులు పాల్గొన్నారు.