Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
సైదాబాద్లో ఆరేండ్ల బాలికపై లైంగిక దాడి జరిపి హత్య చేసిన నిందితుడు రాజుది ముమ్మాటికి ఆత్మహత్యేనని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టేషన్ ఘన్పూర్ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద కోణార్క్ రైలు కింద పడి రాజు ఆత్మహత్య చేసుకోవడాన్ని ఏడుగురు ప్రత్యక్ష సాక్షులు చూశారని ఆయన తెలిపారు. ముఖ్యంగా రైలుకు చెందిన ఇంజన్లో ఉన్న ఇద్దరు డ్రైవర్లు, ఆ ప్రాంతంలో పొలం పని చేసుకుంటున్న నలుగురు రైతులు, ఒక రైల్వే గ్యాంగ్మెన్ రాజు ఆత్మహత్య చేసుకున్నట్టుగా సాక్ష్యమిచ్చారని డీజీపీ వివరించారు. ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో రైల్వే ట్రాక్ వద్ద తచ్చాడుతున్న రాజును గ్యాంగ్మెన్ చూసి ఇక్కడే ం చేస్తున్నావని అడుగగా అతను అక్కడి తప్పించుకుని పొదలవైపునకు పారిపోయాడనీ, తర్వాత తన పని చూసుకుని గ్యాంగ్మెన్ అదే దారిలో వెనక్కి వచ్చి చూడగా రాజు ట్రాక్పై ప్రమాదానికి గురై నిర్జీవంగా పడి ఉండటాన్ని చూశాడని ఆయన తెలిపారు. అలాగే తమ రైలు కింద ఒక యువకుడు పడి ఆత్మహత్య చేసుకు న్నట్టు కోణార్క్ రైలు కు చెందిన ఇద్దరు డ్రైవర్లు స్టేషన్ ఘన్పూర్లో తమ శాఖకు చెందిన ఉన్నతాధికారులకు రిపోర్టు చేశారని అన్నారు. ఇక రైల్వే ట్రాక్ సమీపంలో పొలం పని చేసుకుంటున్న రైతులు కూడా తమ ఎదుటే ఒక యువకుడు రైలు కింద పడి చనిపోవడాన్ని చూసినట్టు తెలిపారన్నారు. రాజు ఆత్మహత్యపై కొందరు సమాజాన్ని తప్పు దోవ పట్టించే రీతిలో వ్యాఖ్యానాలు చేయడం తగదన్నారు. జరిగిన ఘటన గురించి పోలీసులు ఎలాంటి అబద్ధాలు చెప్పడంలేదని ఆయన స్పష్టం చేశారు.