Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు లేఖ రాశారు. శుక్రవారం లక్నోలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ బకాయిలు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, గ్రాంట్లు తదితరాంశాలను ప్రస్తావించారు. 2018-19 సంవత్సరానికి సంబంధించి ఐజీఎస్టీ పరిహారం కింద రూ.210 కోట్లు చెల్లించాలని కోరారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మద్దతివ్వాలని కోరారు. ఇందుకు సంబంధించి 2019-20 సంవత్సరానికి నిధులు విడుదల కాలేదని తెలిపారు. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 10 నుంచి 33కి పెరిగిందని గుర్తు చేశారు. దీంతో వెనుకబడిన జిల్లాల సంఖ్య 9 నుంచి 32కి పెరిగిందని తెలిపారు. ఈ క్రమంలో ప్రత్యేక ప్రోత్సాహకాలను మరో ఐదేళ్లు పొడిగించి, ప్రస్తుత యేడాదితోపాటు 2019- 20 సంవత్సరానికి సంబంధించిన గ్రాంట్లను త్వరగా విడుదల చేయాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 2020-21 సంవత్సరానికి తెలంగాణకు రూ.723 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల సాంప్రదాయాన్ని, దాని పవిత్రతను కాపాడేందుకు.. గ్రాంట్లు ఇవ్వకూడదనే నిర్ణయాన్ని పున్ణపరిశీలించటం ద్వారా వాటిని త్వరగా విడుదల చేయించాలని హరీశ్రావు కోరారు.