Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉజ్బెకిస్తాన్ రాయబారి దిల్షోద్ అఖతోవ్ రాష్ట్ర హౌం మంత్రి మహ్మద్ మహమూద్ అలీని తన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఉజ్బెకిస్తాన్ నాగరికత, ఇరుదేశాల సంబంధాలపై చర్చించారు. తెలంగాణలో ఉజ్బెకిస్తాన్ దేశ వ్యాపార సంస్థలు వ్యాపారం చేయాలని భావిస్తున్నాయని అఖతోవ్ చెప్పారు. హౌంమంత్రి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వ్యాపార సంస్థలకు చక్కటి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ఐ.టి శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చొరవతో పలు కంపెనీలు తెలంగాణలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయని పేర్కొన్నారు. గంగా-జమునా విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను రాయబారి ప్రశంసించారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ మీర్ నాసిర్ అలీ ఖాన్, మేనేజింగ్ ఆఫీసర్ అనుపమ్ కపూర్, తదితరులు పాల్గొన్నారు.