Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సైదాబాద్లో చిన్నారి హత్యాచార కేసు నిందితుడు పి. రాజుది ఆత్మహత్య కాదని, అది హత్యేనని, పోలీసులే హత్య చేసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సష్టించారని దాఖలైన పిల్పై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. రాజు మతి వివాదంపై న్యాయ విచారణకు ఆదేశించింది. వరంగల్ మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ విచారణ చేసి 4 వారాల్లో సీల్డ్ కవర్లో రిపోర్టును అందజేయాలని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ వినోద్కుమార్ల డివిజన్ బెంచ్ శుక్రవారం ఆదేశాలిచ్చింది. రాజుది ఖచ్చితంగా పోలీసులు చేసిన హత్యేనని, దీనిపై న్యాయవిచారణకు ఆదేశించాలని, సిట్టింగ్ లేదా విశ్రాంత జడ్జితో విచారణకు ఆదేశాలు ఇవ్వాలని, మతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర పౌరహక్కుల సంఘం నేత లక్ష్మణ్ అత్యవసర పిల్ వేశారు. రాజు పోలీసుల అదుపులో ఉన్నాడని మంత్రి కల్లకుంట్ల రామారావు, ఎన్కౌంటర్ చేస్తామని మరో మంత్రి మల్లారెడ్డి, రాజు విషయంలో ఏం జరుగుతుందో చూడాలని మరో ఎమ్మెల్యే మాట్లాడారని గుర్తుచేశారు. ఆ తర్వాతే రాజు చనిపోవడంతో అనుమానాలు ఉన్నాయని పిటీషనర్ న్యాయవాది వాదించారు. రాజు దొరికిన తర్వాతే అతని తల్లి, భార్యను పోలీసులు విడిచిపెట్టారని, రాజును చంపి ఆత్మహత్యగా చిత్రీకరణ చేస్తున్నారని చెప్పారు. రాజుది ఆత్మహత్యేనని, హత్యకానేకాదని ఏజీ బీఎస్ ప్రసాద్ చెప్పారు. ఏడుగురి సాక్ష్యాలను వీడియో తీశామని, ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారని, పోస్టుమార్టాన్ని కూడా వీడియో తీశారని తెలిపారు. వాదన ల తర్వాత హైకోర్టు డివిజన్ బెంచ్.. అనుమానాలు ఉన్నందున జ్యుడీషియల్ ఎంక్వయిరీకి ఆదేశాలిస్తున్నామని తెలిపారు. పోస్టుమార్టం వీడియో ఉన్న పెన్డ్రైవ్ను వరంగల్ జిల్లా జడ్జికి శనివారం రాత్రి 8 గంటల్లోగా ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.