Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు అధికారమిస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు
- మల్లికార్జున ఖర్గే
నవతెలంగాణ-గజ్వేల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గజ్వేల్ సభలో ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్, ప్రాణాలు అర్పించింది కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని పునరుద్ఘాటించారు. దేశంలో దళితులు, గిరిజనులు, బహుజనులకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. మోడీ కేవలం అదాని, అంబానీ వెంట పడ్డారన్నారు. ఒకరు అమ్ముతారు.. మరొకరు కొంటారని ఆయన అన్నారు. వీళ్ల పాలనలో ధనవంతులు మరింత ధనవంతులుగా, బీదలు మరింత బీదలుగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో, దేశంలోనూ చీకటి నెలకొని ఉందని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కేసీఆర్, మోడీలకు సెల్ఫోన్ లైట్లు వెలిగించాలని కోరగానే... అందరూ లైట్లు వెలిగించారు. తెలంగాణను ఇచ్చిన సోనియానే కేసీఆర్ విమర్శిస్తున్నారని తెలిపారు.
భారీగా హాజరైన జనం
కాంగ్రెస్ నిర్వహించిన దళిత గిరిజన దండోరా సభకు జనం భారీగా హాజరయ్యారు. సీఎం నియోజకవర్గంలోనే జనం భారీగా రావడంతో కాంగ్రెస్ నేతల్లో ఆనందంగా ఉన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎఐసిసి నేతలు కూడా జనాన్ని చూసి.. ఇంత జనాన్ని చూసి రాహుల్గాంధీ సంతోషంగా ఉండేవారన్నారు.