Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లబ్యాడ్జీలు ధరించి ప్రిన్సిపాళ్లకు వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు జీతాల చెల్లింపుపై అధికారుల జాప్యంపై ప్రభుత్వ కాలే జీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (జీసీసీఎల్ఏ-475) ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమాలు జరిగాయి. వారు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఆయా కాలేజీల్లో ప్రిన్సిపాళ్లకు, జిల్లాల్లో ఇంటర్ విద్యాశాఖ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.