Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తంగళ్ళపల్లి
భారీ వర్షాల వల్ల పైరుకు నష్టం వాటిల్లగా.. పెట్టుబడి ఖర్చులు.. గత సాగు పెట్టుబడి అప్పులు పెరిగిపోతుండటంతో ఆందోళనకు గురైన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని అంకుశాపూర్ గ్రామంలో శుక్రవారం జరిగింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. కొనలేని హనుమయ్య(60)కు ముగ్గురు కుమార్తెలు సంతానం. వారికి వివాహాలు చేయగా.. సుమారు రూ.5లక్షల అప్పు అయిం ది. అదే సమయంలో తనకున్న కొద్దిపాటి భూమిలో పత్తి సాగు చేయగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయాడు. చేసిన అప్పుకు వడ్డీ పెరుగుతున్నదని రోజూ మదనపడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం చేను వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకు న్నాడు. రైతు భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.