Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతి చెందడంతో ఇంటి బాట
- ముగిసిన హరిభూషణ్-శారదక్కల ఉద్యమ ప్రస్థానం
నవతెలంగాణ-కొత్తగూడ/గంగారం
భర్త కోసం అజ్ఞాతంలోకి వెళ్లిన శారదక్క ఆయన మృతితో ఇంటి బాట పట్టిందని తెలుస్తోంది. సుదీర్ఘకాలంపాటు భర్తతో కలిసి మావోయిస్టు పార్టీలో పనిచేసిన శారదక్క.. అనేక ఆటుపోట్లు, ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకుంది. యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ఇటీవల కరోనాతో మృతిచెందగా ఆమె మళ్లీ ఇంటి బాట పట్టింది.
శారదక్క నేపథ్యం..
మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండల కేంద్రానికి చెందిన జెజ్జరి లింగమ్మ-ముత్తయ్యల మూడో కూతురు సమ్మక్క అలియాస్ శారద. ఆమె అన్న మల్లయ్య, అక్క సారక్క ఉండగా అన్న మల్లయ్య చనిపోయారు. గంగారం మండలంలోని మడగూడం గ్రామానికి చెందిన యాప నారాయణతో వివాహం నిశ్చయమైంది. ఆ సమయంలో న్యూడెమోక్రసీతో విభేదాలు, ఇతరత్రా కారణాలతో అప్పటి పీపుల్స్వార్ పార్టీలో 1993లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. యాప నారాయణ అజ్ఞాతంలోకి వెళ్లడంతో 1995లో శారదక్క కూడా అడవి బాట పట్టింది. అనంతరం 2012లో తీవ్ర అనారోగ్యానికి గురై లొంగిపోయి రివార్డు తీసుకుంది. రెండేండ్ల తర్వాత భర్త పిలుపు మేరకు మళ్లీ అడవి బాట పట్టింది. నాటి నుంచి దళ నేతగా, కమాండర్గా పని చేసింది. భర్త మరణం, అనారోగ్య సమస్యలు, ఇతరత్రా కారణాలతో తాజాగా మళ్లీ ఇంటి బాట పట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి ఎదుట ఆమె లొంగిపోయింది.