Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నాగార్జునసాగర్
ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో శుక్రవారం నాగార్జున సాగర్ డ్యాం 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 2,27,795 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో డ్యామ్ అధికారులు 12 క్రస్టు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,79,676 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.80 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 28,785 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్ఎల్బీసీకి 1800 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8454 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 8680 క్యూసెక్కులు, లో లెవల్ కెనాల్ ద్వారా 400 క్యూసెక్కులు మొత్తం 2,27,795 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.