Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఈమేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేరిట అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అప్పటి నుంచి ఆరునెలల్లోపు గడువు ఈనెల 26తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే గురువారం మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ సూత్రప్రాయంగా శాసనసభ సమావేశాలపై స్పష్టత ఇచ్చారు. 24న బీఏసీ సమావేశమై ఎజెండా, పనిదినాలు ఖరారు చేయనుంది. 10 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. వీటిపై చర్చించేందుకు త్వరలో గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు.