Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యామంత్రికి టీపీఏ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ సెకండియర్ విద్యార్థులను వేధిస్తున్న ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డికి శనివారం టీపీఏ అధ్యక్షులు నాగటి నారాయణ, కార్యదర్శి పగడాల లక్ష్మయ్య లేఖ రాశారు. పగలు కాలేజీల్లో ఇంటర్ సెకండియర్ తరగతులకు హాజ రవుతున్న విద్యార్థులు సాయంత్రం ఇంట్లో ఫస్టియర్ పాఠాలు చదవడం ఏమిటని చాలా మంది తల్లిదండ్రులు అడుగుతున్నారని తెలిపారు.