Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తాజాగా 173 మందిలో కరోనా ఉన్నట్టు బయటపడింది. ఒకరు మరణించారు. ఆదివారం విడుదల చేసిన బులెటిన్లో పాజిటివ్ రేటు 0.49 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు 35,160 మందికి పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రుల్లో 29,969 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 5,191 మందికి పరీక్షలు చేశారు. మరో 633 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,005 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా కోలుకున్న 315 మందిని డిశ్చార్జి చేశారు. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 64 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. వరంగల్ అర్బన్, వికారాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో శనివారం కన్నా ఆదివారం కేసులు పెరిగాయి. మిగితా జిల్లాల్లో తగ్గాయి. కాగా నారాయణపేట జిల్లాలో వరసగా మూడో రోజు, జయశంకర్ భూపాలపల్లిలో వరసగా రెండో రోజూ ఒక్క కేసు నమోదు కాలేదు.