Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ, టీఆర్ ఎస్ యేతర పార్టీలు ఈనెల 22న ఇందిరాపార్కువద్ద తలపెట్టిన మహా ధర్నాకు సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరుకానున్నారు. ఈమేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 21న రాత్రికి హైదరాబాద్కు చేరుకుంటారని వెల్లడించారు. ఇదిలా ఉండగా జాతీయస్థాయిలో 19 పార్టీల పిలుపుమేరకు రాష్ట్రం లో ప్రజా సమస్యలపై పోరాడాలని కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), టీజేఎస్, సీపీఐ(ఎంఎల్) న్యూ డెక్రసీ, ఇంటిపార్టీ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీలు నిర్ణయించి నట్టు తెలిపారు. నల్ల సాగు చట్టాలకు వ్యతిరే కంగా ఈనెల 27న రైతు సంఘాలు ఇచ్చిన భారత్బంద్ను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.