Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తాజాగా 208 మందిలో కరోనా ఉన్నట్టు బయటపడింది. ఇద్దరు మరణించారు. సోమవారం విడుదల చేసిన బులెటిన్లో పాజిటివ్ రేటు 0.45 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు 45,274 మందికి టెస్టులు చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో 41,184 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 4,090 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 1,483 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,991 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా కోలుకున్న220 మందిని డిశ్చార్జి చేశారు.
జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 49 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా ఆదిలాబాద్, కామారెడ్డి, మహబూ బాబాద్, మెదక్, ములుగు,నిర్మల్, వనపర్తి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు. రాష్ట్రంలో ఆదివారంతో పోలిస్తే సోమవారం 17 జిల్లాల్లో కేసులు పెరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, ఖమ్మం, మంచిర్యాల, మేడ్చల్ - మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేసులు పెరిగాయి.