Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సెంట్రల్ టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ (సీటెట్) రాతపరీక్షను రాష్ట్రంలో ఎనిమిది కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రకటించింది. ఈ మేరకు సీటెట్ డైరెక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ పట్టణాల్లో నిర్వహిస్తామని తెలిపారు. సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇతర వివరాలకు ష్https://ctet.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.