Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎస్టీఈఏ అధ్యక్షులు కమలాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ పాత పింఛన్ విధానం వర్తింపచేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం (సీపీఎస్టీఈఏ) అధ్యక్షులు దాముక కమలాకర్, ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2003, డిసెంబర్ 31 కంటే ముందు నోటిఫికేషన్ విడుదలై 2004, సెప్టెంబర్ ఒకటి తర్వాత నియామకమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పింఛన్ వర్తింపచేయాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయం కోసం 1.50 లక్షల మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.