Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిజాంసాగర్
కొడుకు మృతితో మనస్తాపానికి గురై తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్ఐ అహ్మద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. మల్లూర్ గ్రామానికి చెందిన గొల్ల సాయిలు(30) గత మంగళవారం కండెన్ చెరువు సమీపంలో గేదెలు మేపేందుకు వెళ్లి చెరువులో పడి మృతి చెందాడు. అప్పటినుంచి ఆమె తల్లి గొల్ల అంజవ్వ (49) తీవ్ర మనస్తాపానికి గురైంది. వేరేగా పడుకుంటానని చిన్న కొడుకుతో చెప్పి బయటకు వెళ్లింది. ఇంటి వెనుకనున్న వేప చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొడుకు పండరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.