Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తాజాగా 244 మందిలో కరోనా ఉన్నట్టు బయటపడింది. ఒకరు మరణించారు. మంగళవారం విడుదల చేసిన బులెటిన్లో పాజిటివ్ రేటు 0.44 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 50,505 మందికి టెస్టులు చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో43,603 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 6,902 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 1,483 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,938 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా కోలుకున్న 296 మందిని డిశ్చార్జి చేశారు. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 72 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా కామారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్, మెదక్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట్, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.