Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బుధవారం ఆదిలాబాద్, కొమ్రం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికను జారీ చేసింది. మంగళవారం రాత్రి 9 గంటల వరకు నల్లగొండ జిల్లా పి.దోమలపల్లిలో అత్యధికంగా 4.93 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 323 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది.