Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సింగరేణి కారుణ్య నియామకాల్లో పెండ్లయిన, విడాకులు పొందిన కుమార్తెలు, ఒంటరి మహిళలకు అవకాశం కల్పిస్తూ ఆ సంస్థ డైరెక్టర్ (పర్సనల్) ఎన్ బలరామ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి 2018 మార్చి 9వ తేదీ నుంచి వర్తిస్తాయని పేర్కొన్నారు. కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియలో ఇప్పటి వరకు అవివాహిత కుమార్తెలు, కుమారుడు, చట్ట ప్రకారం దత్తత తీసుకున్న కుమారుడికి అవకాశం కల్పించే వారు. వీరు లేనిపక్షంలో ఉద్యోగితో పాటు నివసిస్తూ అతడి జీతంపైనే ఆధా రపడిన సోదరుడు, వితంతువులైన కుమార్తె, కోడలు, అల్లుడుకి కారుణ్యం కింద ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఉద్యోగులపైనే పూర్తిగా ఆధారపడిన పెండ్లయిన కుమార్తెలు, విడాకులు పొందిన కుమార్తెలు, ఒంటరి మహిళలకు కూడా అవకాశం కల్పిస్తూ కారుణ్య నియామక ఉత్తర్వుల్లో సవరణలు చేశారు. ఇప్పటి వరకు 82 వరకు మెడికల్ బోర్డులను నిర్వహించి దాదాపు 7 వేల మంది వారసులకు ఉద్యోగాలు కల్పించినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలోనే వారసులైన పెండ్లయిన కుమార్తెలు, విడాకులు పొందిన కుమార్తెలు, ఒంటరి మహిళలకు కూడా ఉద్యో గాల్లో అవకాశం కల్పించాలన్న విజ్ఞప్తి రావడంతో సంస్థ సీఎమ్డీ ఎన్ శ్రీధర్ సానుకూల నిర్ణయం తీసుకుని బోర్డులో ఆమోదింపచేసినట్టు తెలిపారు.