Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్కు కార్మిక సంఘాల వినతి
- రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల మద్దతు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్కీం వర్కర్లు ఈ నెల 24న తలపెట్టిన అఖిల భారత సమ్మెకు ప్రభుత్వ యంత్రాంగం ఆటంకాలు సృష్టించకుండా సహకరించాలని కార్మిక సంఘాల నేతలు కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు ఎం.సాయిబాబు, ఎస్వీ.రమ, జె.వెంకటేశ్(సీఐటీయూ), వీఎస్ బోస్(ఏఐటీయూసీ), ఆర్డీ చంద్రశేఖర్(ఐఎన్టీయూసీ), కె.సూర్యం(ఐఎఫ్టీయూ), జి.రాంబాబు (టీఆర్ఎస్కేవీ), ఎం.శ్రీనివాస్(ఐఎఫ్టీయూ), ఎంకే బోస్(టీఎన్టీయూసీ), బాబూరావ ు(ఏఐయూటీ యూసీ) సంయుక్తంగా లేఖను బుధవారం రాశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల రాష్ట్రంలోని పేదలు, మహిళలు, పిల్లలకు కొంత లబ్ది చేకూరుతున్నదనీ, రాష్ట్రంలో 3 లక్షల మందికిపైగా ఉపాధి లభిస్తున్నదని తెలిపారు. అలాంటి వాటిని మోడీ సర్కారు క్రమంగా నిర్వీర్యం చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాలను కాపాడుకునేందుకు స్కీం వర్కర్లు సమ్మెకు పిలుపునిచ్చారని తెలిపారు. ఈ జాతీయ సమ్మెకు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ పేరుతో ఆటంకాలు సృష్టించడం సరిగాదని పేర్కొన్నారు. ఈ సమ్మెకు సహకరించాలని కోరారు. స్కీం వర్కర్ల సమ్మెకు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు వేర్వేరు ప్రకటనల్లో మద్దతు తెలిపాయి.