Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తాజాగా 258 మందిలో కరోనా ఉన్నట్టు బయటపడింది. ఒకరు మరణించారు. బుధవారం విడుదల చేసిన బులెటిన్లో పాజిటివ్ రేటు 0.46 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం 5.30 గంటల నుంచి బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు 55,419 మందికి టెస్టులు చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో49,867 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 5,552 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 1,681 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,946 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా కోలుకున్న 249 మందిని డిశ్చార్జి చేశారు. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 69 మందికి కరోనా సోకింది.