Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భర్తను హతమార్చిన భార్య
నవతెలంగాణ-మరిపెడ
వేధింపులకు తాళలేక భర్తను భార్య హతమార్చింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మూలమర్రి తండా గ్రామ పంచాయతీ పరిధి వాంకుడోతు తండాలో బుధవారం జరిగింది. సీఐ ఎన్. సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకుడోతు తండాకు చెందిన భూక్య బిచ్చ(50), ప్రమీల దంపతులు. కాగా బిచ్చ రోజు మద్యం సేవించి భార్యతో గొడవ పడుతూ వేధించేవాడు. వేధింపులకు తాళలేక మంగళవారం రాత్రి గొడవ పడుతున్న బిచ్చను కొట్టగా మర్మాంగాలపై తగిలింది. దాంతో బిచ్చ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.