Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తృటిలో తప్పిన ప్రమాదం
- కామారెడ్డి రైల్వేగేట్ సమీపంలో ఘటన
నవతెలంగాణ-కామారెడ్డిటౌన్
గూడ్స్ రైలు రెండుగా విడిపోయిన ఘటన కామారెడ్డి రైల్వే గేట్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు కామారెడ్డి రైల్వే గేట్ వద్దకు రాగానే గూడ్స్ బోగీలకు సంబంధించిన క్లిప్పింగ్ ఒక్కసారిగా ఊడిపోయాయి. దాంతో గూడ్స్ రైలు బోగీలు విడిపోయాయి. అది గమనించిన రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. గూడ్స్ రైలును అక్కడికక్కడే నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. ఈ క్రమంలో సుమారు అరగంట పాటు గూడ్స్ రైలు నిలిచిపోయింది. రైల్వే అధికారులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.