Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళపై లైంగికదాడి.. ఆపై హత్య.. బంగారం చోరీ
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. మహిళపై లైంగిక దాడి చేసి హత్య చేశారు. అనంతరం ఒంటిపై ఉన్న నగలను దోచుకెళ్లారు. ఈ సంఘటన బుధవారం నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ధనలక్ష్మీ (54) కిరాణ దుకాణంతో పాటు బెల్ట్షాపు నడుపుతోంది. అదే గ్రామానికి చెందిన బక్కతట్ల లింగయ్యయాదవ్, కుమ్మరి పుల్లయ్య బుధవారం ఆమె దుకాణంలో మద్యం సేవించేందుకు వచ్చారు. ఆ సమయంలో ధనలక్ష్మీ ఒంటిపై బంగారు నగలు ఉన్నట్టు గుర్తించారు. వాటిని అపహరించేందుకు కుట్ర పన్నారు. మద్యం సేవించిన తర్వాత వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పరిసర ప్రాంతాల్లోనే ఉన్న వారు ధనలక్ష్మీ బయటికి రావడాన్ని గమనించి ఆమెపై దాడి చేశారు. వివస్త్రను చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు నగలను అపహరించుకుని పారిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.