Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-వేంసూరు
విద్యారంగం పట్ల ఉపాధ్యాయులు మౌనం వీడి సమస్యలపై పోరాడాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని వేంసూర్, కల్లూరుగూడెం, అదసర్ల పాడు గ్రామాల్లోని పాఠశాలలను ఆయన సందర్శించి ఉపాధ్యాయ, విద్యార్థినీ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులకు పలు సూచనలు అందజేశారు. ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల సమస్యలను ఉపాధ్యాయులందరూ డీఈవో, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. అక్కడ నుంచి సమస్యలపై ప్రభుత్వంతో పోరాడేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గుతుందనే అపోహలో ప్రభుత్వం ఉందనీ, వాటి నుంచి బయటకి రావాలని తెలిపారు. ప్రతి పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికులను నియమించి వారికి కనీస వేతనం రూ.5 వేలకు తగ్గకుండా చెల్లించేందుకు ప్రభుత్వంపై పోరాడుతున్నానని తెలిపారు. సమావేశంలో ఎంఈఓ సీహెచ్ వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా బాధ్యులు జీఎస్ఆర్ రమేష్, మండల బాధ్యులు మేకల ధర్మారావు, ఈశ్వర చారి, నాగేంద్ర రావు, మేడ సత్యనారాయణ, వెంకటేశ్వర్లు నాయకులు పాల్గొన్నారు.